Page:
  1. 1
  2. 2

ఏపీని ఆక్వా హబ్ గా మార్చిన ప్రభుత్వం

నరసాపురం : వైస్సార్ సీపీ ప్రభుత్వం , ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ని ఆక్వా హబ్ గా తీర్చిదిద్దినట్లు రాష్ట్ర పశు సంవర్ధక  మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు . పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో ఏర్పాటైన ఫిషరీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా మెగా ఆక్వా మేళా పేరుతో శుక్రవారం పట్టణంలో ఆక్వా రైతులు వర్క్ షాప్ నిర్వహించారు .గోదావరి జిల్లాల నుంచి ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సద్ధస్సును  ప్రభుత్వ చీఫ్ విఫ్  ముదునూరు ప్రసాద్ రాజు తో కలిసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు . ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వా సాగును ప్రోత్సహించాలనే లక్యంతో ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్వా చెరువులకు యూనిట్ రూ .1.50 కేవిధ్యుత్ ను సబ్సిడీ పై ఇస్తున్నారని చెప్పారు . ఇందుకోసం ప్రభుత్వం రూ.720 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తున్నాడని చెప్పారు .కోవిడ్ సమయంలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లకుండా మన రాష్ట్రం నుంచి ఎగుమతులు సవ్యంగా సాగేలా , రేటు పతనం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు .జగన్ ముఖ్యంన్త్రిగా లేకుంటే ఆక్వా రంగం కుదేలైయేదని వివరించారు .ఆక్వా ఎగుమతుల్లో దేశంలో ఎపి మొదటి స్ధానంలో ఉందంటే సీఎం జగన్ నిర్ణయాలే కారణమని చెప్పారు . వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదం తో పాటు గా ఆక్వా నీడ్స్ జగన్ అనే నినాదం వినిపిస్తోందని తెలిపారు. ప్రతిపక్షల వారు, ముఖ్యానంగా చంద్రబాబు నాయుడు  జగన్  వచ్చిన తర్వాత ఆక్వా రైతులు కాశపడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు . చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఆక్వా రంగానికి పైసా ఖర్చు చేయలేదని తెలిపారు. ఈ విషయమై టీడీపీ నాయకులను నిలదీయాలని ఆక్వా రైతులకు సూచించారు .ప్రభుత్వ చీఫ్ విఫ్  ముదునూరు ప్రసాద్ రాజు మాట్లాడుతూ తమిళనాడు ,కేరళలో మాత్రమే ఫిషరీ యూనివర్సిటీలు ఉన్నాయని , మూడోది గా నరసాపురంలో ఫిషరీ యూనివర్సిటీ రూ. 350 కోట్లతో ఏర్పాటైందని చెప్పారు .పనులు కొనసాగుతున్నాయని , ఈ విద్య  సంవత్సరం తుఫాన్ షెల్టర్ భవనాల్లో తరగతులు కొనసాగిస్తామని తెలిపారు .బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు .అగ్నికుల క్షత్రియ సంక్షేమ కార్పరేషన్ చైర్మన్ తిరుమని నాగరాజు , మత్స్య కార సొసైటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆండ్రాజు చల్ల రావు ,నరసాపురం ఆర్డీవో ఎం . అచ్యుత్ అంబరీష్ , మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ  జడ్పీటీసీ సభ్యులు బొక్క రాధాకృష్ణ , తిరుమాని బాలాజీ , వనేకుల కార్పొరేషన్ డైరక్టర్ బంధన్ పూర్ణ చంద్ర రావు , జిల్లా చేపల సాగు రైతుల సంఘం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు , రొయ్యల సాగు రైతుల సంఘం అధ్యక్షుడు మోహన్ రాజు , ఫిషరీస్ యూనివర్సిటీ డీన్ రవీంద్ర కుమార్ రెడ్డి ,ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. నీరజ పాల్గొన్నారు .

source: sakshi