Page:
  1. 1
  2. 2

మత్స్యం ...మిలమిల 

మచిలీ పట్నం : రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది .ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహకారం , సబ్సిడీ లు ప్రోత్సాహకాలతో ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది .రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉండటంతో మత్స్య సంపద విరివిగా ఉత్పత్తి అవుతోంది .వెనామీ రొయ్యలు , పండుగప్ప వంటి ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి  మత్స్య ప్రాంతం విస్తరించి ఉండటంతో మత్స్య సంపద విరివిగా ఉత్పత్తి అవుతోంది .వెనామీ రొయ్యలు , పండుగప్ప వంటి ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి  మత్స్య పరిశ్రమ పై ఆధారపడి ప్రత్యక్షంగా , పరోక్ష్యంగా  లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు . మత్స్య పరిశ్రమ చేయూతనివ్వడంతో పాటు దానికి మరింత భద్రత కల్పించేలా ఆక్వా దేవలోప్మెంట్ అధారిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది . ఆక్వా పరిశ్రమ గుర్తింపునిచ్చింది .రైతులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ఈ చట్టం చేసింది .దీని ప్రకారం ఆక్వా సాగు కోసం చెరువులు , ఉత్పత్తికి విక్రయానికి , ఐస్ ఫ్యాక్టరీస్ ఏర్పాటుకు తప్పనిసరిగా మత్స్య శాఖ నుంచి లైసెన్సుస్ తీసుకోవాల్సి ఉంటుంది  దీనిపై మత్స్యశాధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు లైసిన్స్ పొందితే బినామీలు , నకిలీల బెడద తప్పుతుంది . నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది .రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే , ఇప్పటి వరకు 90 వేల  ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేసి లైసెన్సులు జారీ
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ....
రాష్ట్రంలో వైస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది.మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్ ను సరఫరా చేస్తున్నారు  పెద్ద బోట్లకు నెలకు 3,000 , చిన్న బోట్లకు నెలకు 300  లీటర్ల డీజిల్ నుసబ్సిడిపై అందిస్తున్నారు .టీడీపీ ప్రభుత్వ హయాంలో లీటర్ కు రూ.6.03 పైసలే సబ్సిడీ ఇచ్చేవారు .ఆ డబ్బులు సకాలంలో వచ్చేవి కావు వైస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక లీటర్ కు రూ .9 సబ్సిడీ ఇస్తోంది .ఇలా ఏడాదికి సుమారుగా రూ .7.12 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం బోటు యజమానులకు అందిస్తోంది వేట సమయంలో ప్రమాదశాత్తు మత్స్య కారుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ .10 లక్షల పరిహారం ఇస్తోంది .ఏటా వేసవిలో 60 రోజుల పాటు సముద్రంపై వేట నిషేధాన్ని అమలు చేస్తారు .ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో కేవలం రూ .4 వేలు మాత్రమే జీవన భృతిగా ఇచ్చారు .ఆ పంపినే విధానం కుడా సరిగా లేకపోవడంతో వాటిని దాదాపు గా దళారులే మింగేశారు .వైస్ జగన్ సీఎం అయ్యాక జీవన భృతిని రూ .10 వేలకు పెంచి .. మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది .ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం సాయం చేయడం వాళ్ళ రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తి పెరిగింది .2014-15 నాటికి రాష్ట్రంలో 103 లక్షల మెట్రిక్ టన్నులుంటే ...2020-21 నాటికి 150 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది .దేహసంలో ఉత్పత్తి అవుతున్న మత్స్య సంపదతో పోలిస్తే ..ప్రస్తుతం 31 శతం వాటా మన రాష్ట్రానిదే కావడం విశేషం .. వైస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్నా ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైందని మసత్యకారులు చెబుతున్నారు .
source : sakshi