Page:
  1. 1
  2. 2

ఆక్వా ఉత్పత్తులకు ముందే ధరల నిర్ణయం

ఆక్వా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఆ ఉత్పత్తలకు ముఖ్యమంత్రి వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయించారని రాష్ట్ర పశుసంవర్ధక , మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. విఐటి ధరల్లో హెచ్చు తగ్గులున్నప్పటికీ రైతులకి లబ్ది చేకూర్చెదుకు ముఖ్యమంత్రి విఐటి ధరలను ప్రకటించారని చెప్పారు.దేశంలో ఏ రాష్ట్రంలోను ఈ తరహా నిర్ణయం తీసుకోలేదని , ఇదే మొదటిసారని వెల్లడించారు .ఆక్వా,పౌల్ట్రీ , పాడి రంగాలపై  తీసుకున్న నిర్ణయాలను శనివారం సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు . సమీక్షలో వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య , మత్స్య శాఖ కమిషనర్ సోమశేఖర్ , ఎంపెడా జాయింట్ డైరెక్టర్ విజయ కుమార్ తదితరులు  పాల్గొన్నారు .
మంత్త్రి మోపి దేవి తెలిపిన వివరాలివీ ...
1 . ఈ నెల 14  వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
2 . కరోనా వైరస్ కారణంగా ఆక్వా , పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు .
3 . రాష్ట్రంలోని మొత్తం ఆక్వా ఉత్పత్తుల్లో ౯౦ శాతం అమెరికా , చైనా , యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి 
4 . రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని కలిగిస్తున్న ఈ రంగ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం .
5 . ఎగుమతులకు ఆటంకం కలగకుండా చూస్తాం . ఐదారు రోజులగా ఆక్వా రైతులు , వ్యాపారులు , ఎగుమతిదారులతో సమీషిస్తున్నాం .
6 . కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు వఛ్చిన ఎగుమతిదారులను సి ఎం అభినందించారు .
7 . కరోనా పేరు చెప్పి దళారులు రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం . దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం . వియరి పై చర్యలు తీసుకొనే అధికారాన్ని ఎంపెడాకు అప్పగిస్తున్నాం .
8 . ఆక్వా , మత్స్య ఉత్పత్తులకు సంబంధించినఎక్స్  పోర్ట్ ఇన్సెపెక్షన్ అధారిటీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తున్నాం .
9  . మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించాం .
10 . విదేశాల నుంచి మేతతయారిఇకి సంబంధించిన ముడి పదార్ధాల దిగుమతికి విఇరు సహకరిస్తారు .
11 చికెన్ , గుడ్లు మార్కెట్ ల్లో అమ్ముకోవడానికి రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నాం .
12 . సి ఎం సహాయ నిధికి పౌల్ట్రీ రంగం రూ. 60  లక్షలు అందజేసింది.
Source : sakshi