Page:
  1. 1
  2. 2

టైగర్ సరికొత్తగా ....!

ఒంగోలు : టైగర్ అంటే ఆక్వా రంగం లో రారాజు ...  నీలి విప్లవానికి నాంది .అంతర్జాతీయ మార్కెట్లో టైగర్ రొయ్యకు మంచి గిరాకి ఉంది . కేవలం ఎగుమతి కోసమే ఉత్పత్తి చేసే టైగర్ రొయ్య పేరు రెండు దశాబ్దాల పాటు వినపడకుండా పోయింది . 1990 తరువాత వివిధ రకాల వైరస్ లు సోకడంతో కనుమరుగైంది . ఆ తరువాత వెనామీదే రాజ్యం . తాజాగా వెనామీ కూడా వైరస్ ల బారిపడి రైతులకు నష్టాలను తెచ్చిపెడుతోంది . ప్రస్తుతం ఎన్నో అధునాత న ప్రయోగాలు , పరిశోధనలతో వైరస్ కు ఎలాంటి తావు లేకుండా ఉండే సరికొత్త టైగర్ బ్రూడర్స్ ను దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు .ఆ బ్రూడర్స్ ద్వారా సీడ్ ను ఉత్పత్తి చేసి ఆక్వా సాగు చేసే రైతులకు అందజేస్తున్నారు .దీంతో తిరిగి వనామెకి ప్రత్యామ్నాయంగా టైగర్ రొయ్య పూర్వ వైభవాన్ని సంతరించుకొంది . 
నకిలీకి తావు లేకుండా నిఘా ..
టైగర్ రొయ్యల సాగు తిరిగి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది . నకిలీ టైగర్ రొయ్యల సీడ్ బారిన పడకుండా ఆక్వా రైతులను కాపాడటానికి తనిఖీలను ఇప్పటికే ముమ్మరం చేసింది . టైగర్ సీడ్ ముసుగులో వెనామీ రొయ్య పిల్లలను రైతులకు అంటగట్టకుండా హేచరీలపై ప్రత్యేక నిఘా పెట్టింది .ప్రత్యేకంగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది .జిల్లాలోని 41  హేచరీలపై కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ జిల్లా మత్స్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇటీ దాడులు నిర్వహించారు .ఈతముక్కల గ్రామంలో ఒక హేచరీ నుంచి నకిలీ టైగర్ సీడ్ బయటకు వచ్చిందని సమాచారం రావటంతో అధికారులు తానిఖీలు చేసి దానిని మూసివేశారు . టైగర్ సీడ్ పేరుతొ మోసం చేస్తే కఠిన చర్యలు  తీసుకున్నామని అధికారులు హెచ్చరిస్తున్నారు .
దక్షిణ భారతదేశంలో  రెండు హేచరీలకు అనుమతి ...
టైగర్ రొయ్యల సీడ్ ఉత్పత్తికి దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి . సరికొత్త బ్రూడర్ తో సీడ్ ను ఉత్పత్తి చేయటానికి తమిళనాడు చెంగల్ పట్టులోని హేచరీ , నెల్లూరు జిల్లాలోని వైష్ణవి హేచరీలకు మాత్రమే అనుమతులిచ్చాయి . ఈ రెండు హేచరీలకు సరికొత్త బ్రూడర్ ను విదేశాలనుంచి  దిగుమతి చేసుకుని సీడ్ ను ఉత్పత్తి చేస్తున్నాయి . అమెరికా నుంచి సరికొత్త బ్రూడర్స్ ని దిగుమతి చేసుకొని కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అనేక పరీక్షల తరువాత అనూకులంగా ఉంటేనే వాటి నుంచి సీడ్ ఉత్పత్తి  చేస్తున్నారు . జిల్లాలో సాగు చేయాలనుకే వారు నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోని వెయ్యాలి . వాటిని తీసుకొచ్చి స్థానికంగా ఉండే హేచరీలలో వెనామీ సీడ్ తో కలిపి మొత్తము టైగర్ సీడెనని  రైతులను మోసం చేయాలని చూసే వారిపై క్రిమినల్ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడకుండా ఉండేలా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి .
స్టేక్ హోల్డర్లుకు  అవగాహన  ....
ఆక్వా కల్చర్ భాగస్వాముల సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు  ఆక్వా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ ఆధారిటీ యాక్టు ను తీసుకొచ్చింది  . ఆక్వా కల్చర్ భాగస్వాములు అంటే రైతులతో పాటు , ఫీడ్ , సీడ్ , ఉత్పత్తి దారులు , హేచరీల యజమానులు , ట్రేడర్స్ ఎక్సఫోర్ట్ , ప్రాసెసింగ్ ప్లాంట్లు యజమానులు దేనికిందకు వస్తారు .ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది . ఇప్పటికే జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ నెల 23 న స్టేక్ హోల్డర్లు సమావేశం నిర్వహించి నకిలీ టైగర్ రొయ్య సీడ్ తో పాటు ఆక్వా కు సంబంధించిన అన్ని అంశాలపై లోతుగా అధికారులు అవగాహన కల్పించారు .