Page:
  1. 1
  2. 2

చేప, రొయ్య పిల్లలు ......మరింత నాణ్యం

అమరావతి : చేప రొయ్య పిల్లల్లో వ్యాధి కారకాలు ఉన్నట్లు తేలితే లైసెన్సు దారుడిపై  చర్యలతో పాటు .. వాటికి చెల్లించిన పూర్తి మొత్తాన్ని రైతుకు వెనక్కి ఇచ్చేలా ప్రభుత్వం ఆర్డినెన్స తెచ్చింది .జరిమానా కూడా విధించే అవకాశం ఉంది .ఈ మేరకు ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్ కు ప్రభుత్వం సవరణలు చేసింది . ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి లో ఏర్పాటయ్యే చేప పిల్లల పెంపకపు కమిటీకి చైర్మన్ గా మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సభ్య కార్యదర్శి గా కమిషనర్  ఉంటారు . హ్యాచరీ , బ్రూడర్ కేంద్రాలు , చేప పిల్లల యూనిట్ల తప్పనిసరిగా లైసెన్స తీసుకోవాలి . ద్రువీకరించని చేప , రొయ్య పిల్లల్ని విక్రయించకూడదు . కొత్తగా హ్యాచరీ , లార్వా , బ్రూడర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే .. రిజిస్టర్ చేసుకుని లైసెన్సుకు దరఖాస్తు చేయాలి . అన్నీ సక్రమంగా ఉంటే 15 రోజుల్లో అనుమతి ఇస్తారు .
అనుమతి లేకుండా చేపల మేత అమ్మకూడదు 
చేపల మేతలో యాంటీబయోటిక్ , ఫార్మకోలోజికల్ పదార్ధాలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది . ఆ మేరకు సంచిపై ద్రువీకరించాలని సూచించింది . వీటితో పాటు లైసెన్సు  లేకుండా చేపలు , రొయ్యల మెటా మేత వ్యాపారం చేసినా , అనుమతించని , కాలం చెల్లిన దాణాను విక్రయించినా చర్యలు తీసుకుంటారు . చేపల మేత తయారీ , పంపీణే , పర్యవేక్షణ  పై ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసింది పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది  గ్రాడ్యుయేట్ , పీజీ , డిప్లొమా కోర్సులను బోధిస్తారు  ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయం పరిధిలోనే మత్స్య శాస్త్ర కోర్సులను బోధిస్తున్నారు  . ఈ విశ్వ విద్యాలయం కింద నడుస్తున్న కళాశాలలు , పాలిటెక్నీక్ లు , ప్రయోగశాలలను కొత్త వర్సిటీలకు బదిలీ చేస్తారు .
source : sakshi