Page:
  1. 1
  2. 2

జాతీయ స్థాయి ఉత్తమ మెరైన్ జిల్లాగా కృష్టా

ఆక్వా రంగంలో కృష్టా జిల్లా మంచి పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో ... జాతీయ స్థాయిలో ఉత్తమ మెరైన్ జిల్లాగా ఎంపికైనట్లు కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు ..  దేశ స్థాయిలో అసోంలో నాగాం , ఒడిశా లో కలహండి , ఏపీలో కృష్టా ... మొత్తం మూడు జిల్లాలు ఎంపికైనట్లు పేర్కొన్నాడు . ఈ నెల 21 వ తేదీన అంతర్జాతీయ మత్య్స కార దినోత్సనమని , ఈ సందర్భంగా ఎంపికలు జరిగాయన్నారు . జాతీయ స్థాయి అవార్డు ప్రధాన  కార్యక్రమాన్ని 21 న దిల్లీలో నిర్వహస్తారని వివరించారు . అవార్డు కింద రూ .3 లక్షల నగదు బహుమతి , ప్రశంసా పత్రాన్ని అందిస్తారని చెప్పారు . నగరంలోని విడిది కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడారు . 8 లక్షల టన్నుల చేపలు , రొయ్యలను ఉత్పత్తి చేసి , రాష్ట్రంలో జిల్లా ప్రధమ స్ధానంలో నిలిచినట్లు తెలిపారు .జిల్లాలో 111 కిలో మీటర్లు మేర సముద్ర తీరం ఉందన్నారు .49 వేల హెక్టార్లలో మంచి నీటి 19 వేల హెక్టార్లలో ఉప్పు నీటి చేపల పెంపకం ఉన్నట్టు వివరించారు . కరోనా నేపథ్యంలో 4800 మంది రైతులకు రవాణా అనుమతుల కోసం పాసులను జారీ చేసినట్లు తెలిపారు .మత్స్య సాగు బడి కింద నైపుణ్యం గల 100 మంది ఆక్వా రైతులను ఎంపిక చేసి , వారి ద్వారా మిగిలిన రైతులను శిక్షణ ఇప్పించినట్లు పేర్కొన్నారు .కరోనా నిబంధనలు పాటిస్తూ , 9 ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు ద్వారా 6500  టన్నుల రొయ్యలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసి , మార్కెటింగు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు .ఆర్ ఐ .డి ఎస్ . పధకం కింద కొత్త తుమ్మలపాలెం , కానూరు , సొర్లగొంది , పోలాటితిప్ప , నాగాయలంక గ్రామాల్లో షోర్  బెస్ట్ ఫెసిలిటీ సెంటర్లను ఒక్కోక్కటి రూ .కోటితో నిర్మిస్తున్నట్లు చెప్పారు .
source : eenadu