Page:
  1. 1
  2. 2

ఆక్వా హబ్

అమరావతి : నగరాలు , పట్టణాలు , నియోజకవర్గ కేంద్రాల్లో ఆక్వా హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది । తోలి  దశలో  నగరాలు , పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ।ఆ తరువాత నియోజకవర్గ కేంద్రాలకు విస్తరించింది ।వీటి నిర్వహణ భాధ్యతల్ని ఎఫ్ఎఫ్ పీవో  లకు అప్పగిస్తారు .ఎంపికైన ఆక్వా హబ్ నిర్వాహకులకు ప్రభుత్వమే రాయితీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తుంది .హబ్ ల నుంచి రిటైలర్లు ఫిష్ మార్కెట్లు .జనతా  బజార్లకు లైవ్ ఫిష్ రవాణా చేయడానికి వీలుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది .హబ్ లలో కూలింగ్ సెంటర్లు , ఆక్సిజన్ ప్లాంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి .వీటి నుంచి మార్కెట్లకు లైవ్ ఫిష్ రవాణా చేసేందుకు ఐస్ బాక్సు వ్యాన్లను వాడతారు .మత్స్య శాఖ అధికారులు ఆక్వా హబ్ , మార్కెట్ పరిస్ధితులను పర్యవేక్షిస్తారు .
మార్కెట్లో ఒడిదుడుకుల్ని  నివారించేందుకు ...
1. రాష్ట్రంలో ఏటా 35 లక్షల టన్నుల చేపల దిగుబడి వస్తోంది .ఇందులో 90 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి .కేవలం 10 శాతం చేపల్ని మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నారు .
2. రాష్ట్రంలో ఆక్వా సాగు విస్టీర్ణం 2 లక్షల హెక్టార్ల వరకు ఉంది .ఈ రంగంపై ఆధారపడి 1.40 లక్షల కుటుంబాలు ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని పొందుతున్నాయి .
3. ఈ ఉత్పత్తుల ఎగుమతుల విలువ  రూ.25  కోట్లకు చేరుకుంది .
4. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రంగం లాక్ డౌన్ సమయంలో మార్కెట్ల మూసివేత , రానానా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది .
5. భవిష్యత్  లో ఒడిదుడుకులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్థానిక మార్కెట్లను అభివృద్ధి  చేస్తోంది .
6. ఇదే సందర్భంలో పోషక విలువలు అధికంగా ఉండే చేపల్ని ఆహారంగా తీసుకునే అలవాటును ప్రజల్లో పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది .
source :sakshi