Page:
  1. 1
  2. 2

ఆక్వాకు ఊపిరి

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆక్వా రంగానికి ఊపిరి పోస్తోంది . లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రొయ్యల కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి . ఇతర దేశాలకూ ఎగుమతులు ప్రారంభమయ్యాయి . ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు . చెరువుల పెట్టుబడి , రొయ్యల కొనుగోలు చేస్తున్నారు . చెరువుల పట్టుబడి , రొయ్యల కొనుగోళ్లలో గ్రామ సచివాలయ సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు . జిల్లా కలెక్టర్   ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తూ రెవెన్యూ , మత్స్యశాఖ అప్రమత్తం చేస్తున్నారు . ప్రాసెసింగ్ ప్లాంట్లు  నిర్వాహకులు ఎదుర్కొంటున్న కార్మికులను , ప్యాకింగ్ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి . గత నెల 30 వ తేదీ నుంచి ఈ నెల 6 వ నాటికి రాష్ట్రాల్లోని 73  ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వాహకులు 5819 .3 మెట్రిక్ టన్నుల రొయ్యల్ని కొనుగోలు చేశారు . వాటిని ప్రాసెసింగ్ చేసి చైనా , మలేషియా , సింగపూర్ , కెనడా , సౌత్ కొరియా , వియాత్నం దేశాలకు ఎగుమతి ప్రారంభిచారు . విశాఖ , కాకినాడ కృష్టపట్నం ఓడరేవుల నుంచి సోమవారం వరకు 233 కంటైనర్ల ద్వారా 3695 మెట్రిక్ టన్నుల రొయ్యల ఎగుమతి అయ్యాయి .
ముఖ్యమంత్రి ఆదేశాలతో ..
సరిగ్గా 15 రోజుల క్రితం ఆక్వా రైతులు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ఆక్వా సమస్యలను విన్నవించారు . 
2 . తక్షణమే స్పందించిన సీఎం ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్వాహకులు , వ్యాపారులతో సమీక్ష జరపడంతో రొయ్యల కొనుగోళ్లు మొదలయ్యాయి .
3    ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ల గ్రామ సచివాలయ సిబ్బందిని , జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు . 
4 . గ్రామసచివాలయ సిబ్బంది తమ పరిధిలో పట్టుబడికి వఛ్చిన చెరువుల వివరాలను సేకరించి అధికారులకు నివేదిస్తున్నారు . 
5 .అధికారులు ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్వాహకులతో చర్చించి .. చెరువుల్లోని సరుకును కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు .
6 .కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు కార్మికుల కొరత వల్లఇంకా తెరుచుకోలేదు . అధికారులు రంగంలోకి దిగి కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తున్నారు .
7 . మరోసారి అధికారులు , మంత్రులు జిల్లాలో పర్యటించిన క్షేత్రస్ధాయి లో రొయ్యల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని సీఎం ఆదేశించారు .
8 ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం ఈ నెల 30 న రొయ్యల ఎగుమతికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి . 
9 . రాష్ట్రంలో విశాఖ , కాకినాడ , కృష్టపట్నం ఓడరేవుకు ప్రాసెస్ చేసిన రొయ్యలను పంపిస్తున్నారు . 
source : sakshi