Page:
  1. 1
  2. 2

ఆక్వా రైతులకు కోసం  ప్రత్యేక కార్పొరేషన్

 ఆక్వా రైతులకు ప్రత్యేక కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని మత్స్య పశుసంవర్ధక శాఖ మోపి దేవి వెంకట రమణ తెలిపారు కరోనా నివారణపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు . శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ లోఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు . రైతులు అభద్రతా భావంతో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు . ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు . ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తులపై ధరలను నిర్ణయించిందన్నారు . ప్రాసెసింగ్ యూనిట్లలో వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అధికారులను ఆదేశించారు . రైతులు నష్టపోకుండా ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు . 
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్ధ కుదేలైంది 
వ్యవసాయ , వ్యవసాయ అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం వైస్ జగన్ చర్యలు తీసుకున్నారు . రైతులు పండించిన పంటలు , ఆక్వా రంగ ఉత్పత్తులకు నషం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . రైతులు ఎవరు ఆందోళ చెందాల్సిన అవసరం లేదు . అమెరికా వంటి దేశాలు కరోనా వైరస్ వలన  కుదేలైపోయాయి . కరోనా వలన గ్రామాలు కొన్ని కట్టుబాట్లు చేసుకోవడం వలన రైతులకు కొనుగోలుదారులు కొంత గ్యాప్ వఛ్చిన మాట వాస్తవమే . అటువంటి గ్యాప్ లేకుండా , రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారు .గిట్టుబాటు ధారాలపైనా ఎంపెడా కంపెనీ ప్రతినిధులు తో సీఎం సంప్రదింపులు జరిపారు అని మోపి దేవి తెలిపారు . 
ఆ రంగానికి మంచి భవిష్యత్ 
ఎగుమతులపై చైనా ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తుంది . 2830 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు నాలుగు రోజుల్లో ఎగుమతి చేశాము సోమవారం నుంచి ఫిల్డ్ కు వెళ్లి ఎక్స్ పోర్ట్ మీద ఒత్తిడి తెచ్చి వాస్తవ  ధరకే కొనుగోళ్లు జరిగేలా చూస్తాము . ఆక్వా ఉత్పతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది . ధరలు తగ్గిస్తే లైసెన్న్ రద్దు చేస్తాము . మిడిల్ మ్యాన్  వ్యవస్ద చాలా ప్రమాదకరమైనది . దళారి వ్యవస్ధ లేకుండా చేస్తున్నాము . ఆక్వా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంది రైతుల్లో అభద్రతా భావం వద్దు పాజిటివ్ కేసులు పెరగటం వలెనే నిత్యావసర కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది . కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా తగ్గితే సమయంలో సడలింపు ఇస్తాము . గ్రామాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతుంది . అంటూ మంత్రి మోపి దేవి వెంకటరమణ వివరించారు .
Source : sakshi