Page:
  1. 1
  2. 2

భీమవరంలో ఆక్వా యూనివర్సటీ 

అమరావతి : 
భీమవరంలో ఆక్వా యూనివర్సటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు వర్సిటీ స్ధాపనకు అవసరమైన భూమిని సేకరించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది . ప్రాధమికంగా వర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి .
1 . రాష్ట్రంలో ఏటా 25.52 లక్షల టన్నుల చేపలు 11.82 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది .ఇది క్రమంగా పెరుగుతునే ఉంది .
2 . చేపలు , రొయ్యల  సాగులో శాస్త్రీయ  విధానాలను అనుసరిస్తే ఈ దిగుబడి మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సాగుకు సంభందించిన వివిధ కోర్సులు బోధించే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహనరెడ్డి భావించారు .
3. ఉభయ గోదావరి , కృష్టా జిల్లాల్లో ఆక్వా సాగు అధికంగా జరుగుతుండటంతో ఈ జిల్లాల రైతులకు బీమవరం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఇర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు .
4.  ఈ జిల్లాల్లోనే శాస్త్రీయ విధానాలను అనుసరించే రైతులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు , హేచరీస్ నిర్వాహణ , ఎగుమతి వ్యాపారాల్లో కొనసాగుతున్నవారు అధికంగా ఉన్నారు. వీటన్నింటిని పరిశీనలోకి తీసుకొని బీమవరంలో యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు , ఇతర అధికారులను సీఎం ఆదేశించడంతో చర్యలు ఊపందుకున్నాయి . 
5 . దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాడేపల్లి గుడెం సమీపంలో వెంకటరామన్న గుడెంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది .ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భీమవరంలో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పింది .
6 . ఇప్పుడు వైస్ జగన్ ప్రభుత్వం యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడం వాళ్ళ ఆయా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

source : sakshi