Page:
  1. 1
  2. 2

రొయ్యలకూ  క్వారంటైన్ 

అమరావతి : ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో క్వారంటైన్ అనేది విస్తృత వ్యాప్తిలోకి వచ్చింది . అయితే కరోనాకు ముందు నుంచే తల్లి రొయ్యలను క్వారంటైన్ లో ఉంచే విధానం ఉంది  . ఆక్వా చెరువుల్లో వెనామీ రకం రొయ్యల పెంపకానికి హేచరీ నిర్వాహకులు విదేశాల నుంచి గుడ్లతో ఉన్న తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటారు . వాటికి వ్యాధుల నిర్ధారణకు వారం రోజుల పాటు ఆక్వా  టిక్ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు వ్యాధులు లేవని తేలాకే హేచరీలకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు . దేశం మొత్తం మీద చెన్నైలో ఒకే ఒక్క ఆక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ ఉంది . హేచరీల యజమానులు దిగుమతి చేసుకున్న తల్లి రొయ్యలను ఈ కేంద్రంలోనే పరీక్షకు పంపుతారు . 
1. అమెరికా , వియాత్నం , ధాయిలాండ్ దేశాల నుంచి వ్యాధుల్లేవని తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవడానికి మాత్రమే భారత ప్రభుత్వం రిజిస్టర్ హేచరీలకు అనుమతించింది .
2. ఆ రొయ్యలకు వ్యాధులుంటే వాటి ద్వారా ప్రజలకు వైరస్ కారక జబ్బులు సంక్రమిస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ క్వారంటైన్ విధానాన్ని అమలు చేస్తోంది . 
3. దేశంలో మొత్తం 500  హేచరీలుండగా ఒక్క ఏపీలోనే 391  ఉన్నాయి .గతేడాది దేశం మొత్తం మీద 8.05 లక్షల టన్నుల వెనామీ రొయ్యల ఉత్పత్తి జరగ్గా .. రాష్ట్రంలో 5.70  లక్షలుండటం విశేషం . ఇక్కడ 80 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలు సాగవుతున్నాయి .
4. రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా బంగారమ్మ పాలెంలో  ఆక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది . 2018 మార్చిలో శంకుస్ధాపన చేశారు . స్ధల సమస్యలు తలెత్తడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంతో మానేసింది . వైస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్కాక భూసమస్యను పరిష్కరించింది .

5. ఇప్పుడు అక్కడ ౩౦  ఎకరాల్లో రూ.35 కోట్లు వెచ్చింది . ఏ క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు . నెలాఖరుకల్లా టెండర్లు పిలుస్తామని మత్స్యశాఖ ఉన్నతాధికారి చెప్పారు 
source : Sakshi