Page:
  1. 1
  2. 2

రొయ్యల ఎగుమతికి విమానం

సాక్షి: పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఎగరనుంది. రోజంతా పడిగాపులు కాచి .. సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల వెతలు తీరనున్నాయి.రొయ్యలు, రొయ్య పిల్లల రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల నేపధ్యంలో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.మెరైన్ కృషి ఉడాన్ పధకంలో భాగంగా నీలి విప్లవానికి ఊతమిచ్చే విశాఖ అంతర్జాతీయ విమాశ్రమం నుంచి మంగళవారం స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. 18 టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ విమానం చైన్నై నుంచి విశాఖ మీదుగా వారమ్లో 3 రోజులు సూరత్ కు, అదేవిధంగా మర్ మూడు రోజులు కోలకతాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మంగళవారం చైన్నై నుంచి విశాఖపట్నం వచ్చే తొలి విమానం సూరత్ వెళ్లనుంది. ఉత్తరాంధ్రలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. విశాఖ. విజయనగరం, శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో 6 నుంచి 7టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి రొయ్యలకు సూరత్, కోల్ కతాల్లొ మంచి డిమాండ్ ఉంది. అలాగే రొయ్య పిల్లల్ని మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గుజరాత్, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. దీంతో మంచి లాభాల కోసంమనరైతులు సూరత్, కోలకతా లకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యాతనిస్తున్నారు. ఈ ప్రక్రియలోవారుకొన్ని సార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి నుంచి సూరత్ కు తీసుకెళ్లాంటే తొలుత ముంబయికి వెళ్లి .. అక్కడి నుంచి తిరిగి రోడ్డుమార్గంద్వారా గానీ విమానంలో గానీ తరలించేవారు .దీనికి 18 నుంచి24 గంటలుసమయం పట్టేదీ. దీని వల్ల రొయ్యల పిల్లలకు సరైన ఆక్సిహన్ అందక మృత్యువాత పడేవి. ఆహారానికి ఉపయోగించే రొయ్యలు పాడై పనికి రాకుండా పోయేవి. ఇప్పుడు ఇబ్బందులు తొలగిపోవడంతో ఆక్వా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సూరత్,కోలకతాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసు రావడం రొయ్యల ఉత్పత్తికి , ఎగుమతికి ఊతం ఇస్తుందని అంటున్నారు.ఈ విమానం విశాఖ నుంచి సూరత్ కు 2.15 గంటల్లో , కోలకతాకు 1.25 గంటల్లో వెళ్లిపోతుంది. ప్రస్తుతంఒక్కో విమానంలో రొయ్యలు, రొయ్య పిల్లలుకలిపి ఒకటిన్నర టన్నులఎగుమతికి అవకాశం ఉందని , అధికారులు చెబుతున్నారు.    
Source : sakshi